
188 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 188 బస్తాలు రేషన్ బియ్యాన్ని కావలి ఒకటో పట్టణ ఎస్సై గుంజి అంకమ్మరావు పట్టుకున్నారు.
లారీకి పైలెట్గా వ్యవహరిస్తున్న కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం తరలింపులో భాగస్వామ్యం ఉన్న మధురెడ్డి, ఎస్కే షఫీ, పోలయ్య, సురేష్, కోటేశ్వరరావులను అదుపులోనికి తీసుకున్నారు. బియ్యంను పౌరసరఫరాలశాఖ అధికారులకు అప్పగించి లారీని, కారును ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. సీఐ రోశయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.