♦ అందని సిగ్నల్స్
♦ మొరాయిస్తున్న సర్వర్లు
♦ మందకొడిగా పింఛన్ల పంపిణీ
♦ వెర్షన్ మారినా తప్పని వెతలు
♦ లబ్ధిదారులకు అవస్థలు
భీమడోలు :
రోజుకో కొత్త పరికరం.. సహకరించని అప్డేట్ వెర్షన్లు.. సర్వర్ మొరాయింపు.. అందని సిగ్నల్స్, పడని వేలి ముద్రలు ఇవి పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఎదురవుతోన్న సమస్యలు. ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తున్నా లక్ష్యం మేరకు ప్రక్రియ పూర్తికావడంలేదు. పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఈనెల ఏడో తేదీ నాటికే పింఛన్ల సొమ్ము పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్న అధికారుల ఆదేశాలు నెరవేరేలాలేవు. సిగ్నల్స్ అందక సర్వర్ మొరాయించడంతో మండుటెండలోనే లబ్ధిదారులు పడిగాపులు పడాల్సి వస్తోంది. జిల్లాలో 3,72,816 మంది సామాజిక పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 3,16,482 మందికి అంటే 84.75 శాతం ప్రక్రియ బుధవారం సాయంత్రానికి పూర్తయింది. భీమడోలు మండలానికి 16 ట్యాబ్లు ఇచ్చినా పింఛన్ల పంపిణీ ప్రక్రియ మండకొడిగా సాగుతోంది. ఈ మండలంలో 6,578 లబ్ధిదారులు ఉండగా 5,281కి పింఛను సొమ్ము అందించారు. అంటే ఇప్పటికి 80.28 శాతం పూర్తయింది. జిల్లాలోని 57 మండలాల్లో కొవ్వూరు అర్బన్ పింఛన్ల పంపిణీలో ఈ నెల మొదటి స్థానంలో ఉండగా, భీమడోలు మండలం 46వ స్థానంలో ఉంది. కొవ్వూరు అర్బన్ పరిధిలో 2,799 మందికి 2,685 మందికి పింఛన్లు అందించారు. అంటే 95.93 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయింది.
త్రీజీ ట్యాబుల్లో కొత్త వెర్షన్తో ఇబ్బందులు
ప్రస్తుతం మార్కెట్లో 4జీ ట్యాబ్లు హల్చల్ చేస్తున్నా అధికారులు మాత్రం త్రీజీ ట్యాబ్లను అందించి చేతుల దులుపుకోవడంతో పింఛన్ల పంపిణీలో సాంకేతిక ఇబ్బందులు తప్పడంలేదు. రెండున్నరేళ్ల క్రితం పంపిణీ చేసిన బీఓ ట్యాబ్ల్లో 3.2 నుంచి పలు వెర్షన్లు మార్పు చేసి గత నెల వరకు అందించారు. ఈ నెల కొత్త ట్యాబ్ల్లో నూతన వెర్షన్ను పొందుపర్చారు. ఇదే సమస్యగా మారింది. 3జీ ట్యాబుల్లో 4.2 వెర్షన్ అప్డేట్ చేయడంతో సహకరించడంలేదు. బయోమాట్రిక్ మెషీన్లలో వేలిముద్రలు పడడంలేదు. దీంతో లబ్ధిదారులు రెండు మూడు రోజులు ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. పనిచేసే చోట మూడు గంటలకే మెషీన్ చార్జింగ్ అయిపోతుంది. గతంలో వలే మెషీన్ పనిచేస్తుండగా చార్జీంగ్ పెట్టే పరిస్థితి ఇప్పుడులేదు. దీంతో చార్జింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత చార్జింగ్ పెట్టాల్సి వస్తోంది.
నిర్లక్ష్యపుముద్ర
Published Thu, Sep 7 2017 8:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement