ఆటోను ఢీకొన్న లారీ : ఒకరి మృతి | one killed in road accident in railway koduru | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ : ఒకరి మృతి

Sep 17 2016 8:37 AM | Updated on Aug 30 2018 4:10 PM

వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు రూరల్ మండలం ఎస్ ఉప్పరపల్లి హరిజనవాడ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

రైల్వేకోడూరు:  వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు రూరల్ మండలం ఎస్ ఉప్పరపల్లి హరిజనవాడ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ... ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.

స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను 108 వాహనంలో రైల్వేకోడూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మృతుడి వివరాలు మాత్రం తెలియరాలేదని పోలీసులు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement