ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఒకరు చనిపోయారు.
ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఒకరు చనిపోయారు. అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం దాదలూరుకు చెందిన ఆంజనేయులు(50) తోటి రైతులతో కలిసి బెంగళూరు వెళ్లాడు. అంతా కలసి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం పెనుగొండ మండలం గుట్టూరు వద్ద శుక్రవారం వేకువజామున ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఆంజనేయులు అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు.