ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్ | non bailable warrant issued to ms dhoni by anantapur court | Sakshi
Sakshi News home page

ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్

Jan 8 2016 10:39 AM | Updated on Jun 1 2018 8:39 PM

ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్ - Sakshi

ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్

ఓ మేగజైన్ కవర్పేజీపై విష్ణుమూర్తి అవతారంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన కేసు ధోనీని నీడలా వెంటాడుతోంది.

అనంతపురం: ఓ మేగజైన్ కవర్పేజీపై విష్ణుమూర్తి అవతారంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన కేసు ధోనీని నీడలా వెంటాడుతోంది. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ సాగుతుండగా.. అనంతపురం కోర్టు ఇదే కేసులో ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నోటీసులు ఇచ్చినా ధోనీ హాజరుకాకపోవడంతో అనంతపురం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.  ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీహెచ్పీ నేత శ్యాంసుందర్ అనంతపురం కోర్టులో కేసు దాఖలు చేశారు.

బెంగళూరులో మరో వ్యక్తి ధోనీపై కేసు పెట్టారు. మత విశ్వాసాలను కించపరిచేలా ఈ ప్రకటన ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ధోనీ తీరుపై బెంగళూరు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనల్లో నటించే ముందు పర్యవసానాల గురించి ఆలోచించాలని సూచించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement