శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున | Nagarjina visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున

Jun 23 2016 9:12 AM | Updated on Jul 15 2019 9:21 PM

శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున

తిరుమలలో శ్రీవారిని సినీ నటుడు నాగార్జున దంపతులతోపాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమలలో శ్రీవారిని సినీ నటుడు నాగార్జున దంపతులతోపాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం నాగార్జున, అమల దంపతులతోపాటు టీటీడీ బోర్డు సభ్యుడు కె.రాఘవేంద్రరావు, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన వారిని గమనించిన అభిమానులు పెద్దసంఖ్యలో గుమికూడారు.

తిరుమల శ్రీవారి ఆశీస్సులతో కోసం వచ్చినట్లు ప్రముఖ నటుడునాగార్జున తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన నాగార్జున మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓంనమో వేంకటేశాయ’ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతోందని వెల్లడించారు. అందుకే ముందుగా శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ఈ సినిమాలో తనది హథీరాంబాబా పాత్ర అని తెలిపారు. ఆయనతోపాటు సినిమా ప్రొడ్యూసర్ మహేష్‌రెడ్డి, వెంకటేశ్వరుని పాత్రధారి సౌరవ్‌జైన్ కూడా ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement