'మల్లన్న' ను నిర్మించి తీరుతాం | minister harish rao slams congress over mallanna sagar project | Sakshi
Sakshi News home page

'మల్లన్న' ను నిర్మించి తీరుతాం

Sep 19 2016 4:31 PM | Updated on Mar 18 2019 9:02 PM

'మల్లన్న' ను నిర్మించి తీరుతాం - Sakshi

'మల్లన్న' ను నిర్మించి తీరుతాం

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై విపక్షాలు ఎన్నికుట్రలు చేసినా తాము భయపడమని హరీష్ రావు తెలిపారు.

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తాము భయపడమని మంత్రి హరీష్ రావు తెలిపారు. రిజర్వాయర్ కోసం రైతులు స్వచ్ఛందంగా రిజిస్ర్టేషన్ చేసుకున్నారని మంత్రి అన్నారు. 120 జీవో కింద 9 గ్రామాలు ముందుకు వచ్చాయన్నారు. రైతులను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారని మండిపడ్డారు.
 
భూములు లేని రైతుల కూలీలకు పరిహారం చెల్లిస్తామన్నారు. రైతలకు ఎలాంటి నష్టం జరిగినా కాంగ్రెస్, టీడీపీలదే పూర్తి బాధ్యత అన్నారు. ఎవరెన్ని ఆటంకాంలు కలిగించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టును కచ్చింతంగా నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement