తుక్కుగూడలో మైక్రోమాక్స్ ఉద్యోగుల ఆందోళన
మహేశ్వరం(రంగారెడ్డి జిల్లా): మహేశ్వరం మండలం తుక్కగూడ ఫ్యాబ్సిటీలో నెల క్రితం ప్రారంభించిన మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీతాలు తగ్గిస్తున్నారనీ, భోజనంలో సున్నం కలిపి పెడ్తున్నారని, రోజుకు 10 గంటలు పనిచేయించుకుంటున్నారని, చెకింగ్ల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.