వివాహిత ఆత్మహత్య | Married Women Suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Nov 17 2016 11:10 PM | Updated on Sep 4 2017 8:22 PM

మండలంలోని కొప్పోలు గ్రామంలో శ్రావణి (27) అనే వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కొప్పోలుకు చెందిన ఓబుళరెడ్డి భార్య శ్రావణి నాలుగేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది.

వల్లూరు: మండలంలోని కొప్పోలు గ్రామంలో శ్రావణి (27) అనే వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కొప్పోలుకు చెందిన ఓబుళరెడ్డి భార్య శ్రావణి నాలుగేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి వెనుక ఉన్న బాత్‌రూమ్‌ వద్దకు వెళ్లి కిరసనాయిల్‌ మీద పోసుకుని నిప్పంటించుకుంది. శరీరం ఎక్కువగా కాలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి 3, 6 సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తండ్రి మహేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement