‘మంజీర’ మురిసింది | 'Manjeera' | Sakshi
Sakshi News home page

‘మంజీర’ మురిసింది

Sep 16 2016 10:04 PM | Updated on Oct 17 2018 6:06 PM

‘మంజీర’ మురిసింది - Sakshi

‘మంజీర’ మురిసింది

రెండుమూడేళ్లుగా వర్షాలు లేక బోసిపోయిన మంజీర నది

బోధన్‌ రూరల్‌ :  రెండుమూడేళ్లుగా వర్షాలు లేక బోసిపోయిన మంజీర నది గురువారం ఉదయం బోధన్‌ మండలంలోని సాలూర గ్రామ శివార్లో నీటి ప్రవాహంతో కళకళలాడింది. ఉదయం నుంచి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు నీటి ప్రవాహం లేకపోవడంతో మంజీర నది ఇసుక, బండరాళ్లతో దర్శనమిచ్చిందని, నాలుగు రోజులుగా స్థానికంగా, ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షంతో నదిలో నీరు చేరిందని గ్రామస్తులు పేర్కొన్నారు. నీటి ప్రవాహాన్ని చూసేందుకు  నదిపైన గల పాత,కొత్త వంతెనలపై జనాల సందడి నెలకొంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement