-పియురాలిని చంపిన యువకుడి రిమాండు
- కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ అశోక్ కుమార్
మేడ్చల్: పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో మృగంగా మారిన ప్రియుడు ఆమెను చంపేశాడు. కేసు మిస్టరీని ఛేదించిన మేడ్చల్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఏసీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ వుండలంలోని శ్రీ రంగవరం గ్రామానికి చెందిన స్వప్న(19) అదే గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి మహేందర్(23) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్లకు స్వప్న గర్భం దాల్చింది. మరదలంటే ఇష్టం ఉన్న మహేందర్ ఆమెను పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని స్వప్నకు తెలియజేశాడు.
ఇందుకు తిరస్కరించిన స్వప్న తాను గర్భవతినయ్యానని త్వరగా పెళ్లి చేసుకోవాలని మహేందర్ పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. దీంతో స్వప్నను కలిసి మాట్లాడటం మానేసిన మహేందర్ ఫోన్ ద్వారా సంభాషణలు సాగించాడు. ఈ నెల 17న బాబాయి ఫోన్ నుంచి మహేందర్ కు ఫోన్ చేసిన స్వప్న మహేందర్ ను కలవాలని చూడాలని ఉన్నట్లు చెప్పింది. దీంతో స్వప్నను ఎలాగైనా వదిలించుకోవాలని పక్కా ప్లాన్ వేసుకున్న మహేందర్ ఆమెను అంతం చేయాలని పథకం వేసుకున్నాడు. ఈ క్రమంలో దర్గా దగ్గర పొదల్లో కర్రను దాచి ఉంచాడు. తర్వాత స్వప్న రాక కోసం ఎదురుచూస్తుండగా ఆమె రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కల్లు కాంపౌండ్ వద్దకు ఒంటరిగా చేరుకుంది. ప్రియురాలిని తన బైక్ పై ఎక్కించుకున్న మహేందర్ దర్గా దగ్గరున్న పొదల వద్దకు తీసుకువెళ్లాడు.
స్వప్న పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు ఆమె గొంతు నులిమేశాడు. అనంతరం చున్నీతో గొంతుకు బిగించి ఉరి వేశాడు. ఆమె మృతి చెందిందని నిర్థారించుకున్న తర్వాత ఇంటికి వెళ్లిపోయినట్లు ఏసీపీ వివరించారు. మరుసటి రోజు స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహేందర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే స్వప్నను చంపేసినట్లు వెల్లడించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి ఒత్తిడి చేసిందనీ..
Published Wed, May 25 2016 8:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement