కారు ఢీకొని వ్యక్తి మృతి | man dies of car accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Mar 4 2017 10:55 PM | Updated on Aug 14 2018 3:22 PM

మండల పరిధిలోని గార్లదిన్నె సమీపంలో హైదరాబాద్‌-బెంగుళూరు హైవే రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తి కారు ఢీకొన్న ప్రమాదంలో మరణించారు.

శింగనమల : మండల పరిధిలోని గార్లదిన్నె సమీపంలో హైదరాబాద్‌-బెంగుళూరు హైవే రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తి కారు ఢీకొన్న ప్రమాదంలో మరణించారు. మండలంలోని రఘనాథపురం గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి(45) గార్లదిన్నె సమీపంలోని హైవే రోడ్డు పక్కన హోటల్‌ నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్‌ నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్లుతున్న కారు ఢీకొంది. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement