breaking news
surya narayanareddy
-
మారాల్సింది బాలయ్య ఫోకస్!
అధికార పార్టీ అండదండలతో జిల్లాలో కొందరు కల్లు వ్యాపారులు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు వంతపాడుతున్నారు. పైగా కళ్ల ముందు కల్తీ బాధితులు కనిపిస్తున్నా.. మా కళ్లకు అలాంటివేం కనిపించడం లేదంటూ నిర్లక్ష్యంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. స్వయంగా సీఎం బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితులు ఇవి. కల్తీ కల్లుతో హిందూపురం, పరిగి మండలాలకు చెందిన పేదలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవరిస్తుండటంతో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రెండురోజుల క్రితం చౌళూరులో కల్లుతాగిన 13 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. స్థానికంగా వైద్యం అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో బంధువులు వారిని పొరుగున్న ఉన్న కర్ణాటక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలయ్య ఫోకస్ మారాలిహిందూపురంలో ఇప్పటిదాకా ఏ ఇష్యూపైనా ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా స్పందించింది లేదు. ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆధర్వ్యంలో జరుగుతున్న కల్తీ కల్లు వ్యవహారంపైనా ఆయన స్పందిస్తారన్న ఆశలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆస్ట్రేలియా ఎన్నారై, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సూర్య నారాయణ రెడ్డి బాలయ్యపై మండిపడ్డారు. ఏపీలో ప్రతీది కల్తీమయం అవుతోందని.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులను కల్తీ కల్లు కాటేయడం బాధాకరమని అన్నారాయన. ఎప్పుడో ఒకసారి అసెంబ్లీకి వెళ్లి వైఎస్ జగన్ మీదనో, చిరంజీవి మీదనో నోటి దురద తీర్చుకోవడం తప్పించి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. ఆయన నియోజకవర్గంలో పేదలు కల్తీ కల్లు బారిన పడడం.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడం బాధాకరమని అన్నారు. బాలయ్య తన నటనను సినిమాల వరకే పరిమితం చేయాలని.. పేదవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని.. ఇకనైనా ఫోకస్ హిందూపురం మీద పెడితే బాగుంటుందని సూర్య నారాయణ రెడ్డి హితవు పలికారు.జోరుగా.. హిందూపురం పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో రసాయనాలు కలిపిన కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. చౌళూరుకు సరిహద్దున ఉన్న కర్ణాటక గ్రామాల నుంచి సైతం వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈత వనాల నుంచి అరకొరగా వచ్చే కల్లును సేకరించి అందులో డైజోఫాం, హెచ్ తదితర రసాయనాలతోపాటు తీపి కోసం(డబుల్ డెక్కర్) చాకరిన్, చక్కెర, తెలుపు కోసం మైదా కలిపి పేద ప్రజలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. పుట్టపర్తి ప్రాంతంలో ఉన్న ఓ అధికారి కల్లు దుకాణాల నిర్వహణలో చక్రం తిప్పుతున్నారు. హిందూపురం పరిధిలోని ఓ అధికారి నెలనెలా సొసైటీల నుంచి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. హిందూపురానికి చెందిన ఓ వ్యాపారి కొన్నేళ్లుగా గీత సొసైటీలను తన ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి డైజోఫాం, హెచ్ను గుట్టుచట్టుప్పుడు కాకుండా దిగుమతి చేసుకుని తన ఫాంహౌస్లో ఈత కల్లులో కలిపిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
అవును..వాళ్లిద్దరూ ఒకటయ్యారు.!
సాక్షి, బళ్లారి: ,ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన అనిల్లాడ్, నారా సూర్యానారాయణరెడ్డిలు ఒక్కటయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు జాబితా ప్రకటించే వరకు బళ్లారి సిటీ నుంచి లాడ్, నారా ఇద్దరు టికెట్ కోసం తీవ్రంగా లాబీయింగ్ చేశారు. చివరకు అనిల్లాడ్కే టికెట్ దక్కింది. టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడిన నారా, అనిల్లాడ్ ఒక్కటయ్యారు. శుక్రవారం నామినేషన్ దాఖలు కార్యక్రమానికి టికెట్ కోసం పోటీ పడిన నారా, లాడ్ ఒక్కటై రావడం చర్చనీయాంశంగా మారింది. అనిల్లాడ్ నామినేషన్ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు అల్లం వీరభద్రప్ప, దివాకర్బాబులతోపాటు విధాన పరిషత్ సభ్యుడు కే.సీ.కొండయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా హాజరు కాలేదు. అనిల్లాడ్పై కార్పొరేటర్లులో తీవ్ర అసంతృప్తి ఉంది. టికెట్ కోసం పోటీ పడిన ఇద్దరు నేతలు చెట్టాపట్టాలు వేసుకుని నామినేషన్ దాఖలు చేయగా, మిగిలిన నేతలు గైర్హాజరు కావడంతో కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపించాయి. అంతర్గత విభేదాలను లాడ్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే. దేవుడు నిర్ణయించలేదు..టికెట్ దక్కలేదు : బళ్లారి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయాలని దేవుడు నిర్ణయించలేదు, అందుకే తనకు టికెట్ దక్కలేదని కురుగోడు మాజీ ఎమ్మెల్యే నారా సూర్య నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆయన నగరంలోని సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టికెట్ కోసం ప్రయత్నించానని, అయితే ఎవరికైనా ఒకరికే కదా టికెట్ వస్తుందన్నారు. టికెట్ రానంత మాత్రాన తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. పార్టీ టికెట్ అనిల్లాడ్కు కేటాయించిందని, ఆయన గెలుపునకు ప్రయత్నం చేస్తామన్నారు. భవిష్యత్తులో తనకు కేంద్ర మంత్రి అయ్యే యోగం ఆ దేవుడు కల్పించారేమోనని చమత్కరించారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
శింగనమల : మండల పరిధిలోని గార్లదిన్నె సమీపంలో హైదరాబాద్-బెంగుళూరు హైవే రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తి కారు ఢీకొన్న ప్రమాదంలో మరణించారు. మండలంలోని రఘనాథపురం గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి(45) గార్లదిన్నె సమీపంలోని హైవే రోడ్డు పక్కన హోటల్ నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్ నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి హైదరాబాద్కు వెళ్లుతున్న కారు ఢీకొంది. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.


