భర్తకు జీవిత ఖైదు..
భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెపై పచ్చడి బండతో దాడి చేసి ఆమె మృతికి కారణమైన భర్త మాతంగి నిరంతరరావుకు జీవిత ఖైదు, రూ. 2 వేలు జరిమాన విధిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి ఎన్ సత్యశ్రీ శుక్రవార ం తీర్పు చెప్పారు.
గుంటూరు లీగల్: భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెపై పచ్చడి బండతో దాడి చేసి ఆమె మృతికి కారణమైన భర్త మాతంగి నిరంతరరావుకు జీవిత ఖైదు, రూ. 2 వేలు జరిమాన విధిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి ఎన్ సత్యశ్రీ శుక్రవార ం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ క«థనం ప్రకారం మండల కేంద్రమైన పెదకాకాని లోని అంబేద్కర్ నగర్కు చెందిన మాతంగి నిరంతరరావు రిక్షా పుల్లర్గా పనిచేసేవాడు. ఆతనికి స్థానికంగా ఉండే పిచ్చమ్మతో 40 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. 2014 అక్టోబర్ 13వతేదీకి రెండు నెలల ముందునుంచి పిచ్చమ్మ మానసిక రుగ్మతకు గురైంది. దీంతో పిచ్చమ్మ నిత్యం తన శారీరక వాంఛను తీర్చాలని భర్తతో వివాదానికి దిగుతుండేది. దీంతో నిరంతరరావుకు పిచ్చమ్మపై అనుమానం పెరిగింది. ఇతరులతో వివాహేతర సంబంధం నెరుపుతుందని అనుమానాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2014 అక్టోబర్ 13న రాత్రి నిద్రిస్తున్న పిచ్చమ్మపై రోకలిబండతో దాడిచేశాడు. దీంతో పిచ్చమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పరిస్థితి గమనించిన పిల్లలు కేకలు వేయటంతో నరంతరరావు అక్కడినుంచి పారిపోయాడు. జరిగిన సంఘటనపై పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితునిపై నేరాన్ని రుజువు చేయటంతో నిరంతరరరావుకు జీవితఖైదు, రూ 2వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సత్యశ్రీ తీర్పునిచ్చారు. ఏపీపీ అంచుల వరదరాజు ప్రాసిక్యూషన్ నిర్వహించగా సీఐ కె షేషారావు కేసు దర్యాప్తు చేశారు.