వీడిన హత్య కేసు మిస్టరీ | Leaving the mystery murder case | Sakshi
Sakshi News home page

వీడిన హత్య కేసు మిస్టరీ

Oct 25 2016 12:56 AM | Updated on Jul 30 2018 8:29 PM

జార్ఖండ్‌కు చెందిన జేసీబీ డ్రైవర్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. మృతుడి సమీప బంధువులైన ఇద్దరు ఈ కేసులో నిందితులు. వీరిని సోమవారం అరెస్ట్‌ చేశారు.

పుట్టపర్తి టౌన్‌: జార్ఖండ్‌కు చెందిన జేసీబీ డ్రైవర్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. మృతుడి సమీప బంధువులైన ఇద్దరు ఈ కేసులో నిందితులు. వీరిని సోమవారం అరెస్ట్‌ చేశారు. పుట్టపర్తి డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి తెలిపిన మేరకు.. సెప్టెంబర్‌ 25న పుట్టపర్తి సమీపాన హంద్రీ–నీవా కాలువ గట్టున గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు హంద్రీనీవా కాలువ పనులకు సంబంధించిన జేసీబీ డ్రైవర్‌ అయిన జార్ఖండ్‌ రాష్ట్రానికి చెంది తులసీఠాకూర్‌గా పోలీసుల విచారణలో తేలింది.  ఆస్తి కోసమే సమీప బంధువు మనోజ్‌ ఠాకూర్, సుధీర్‌శర్మలు తులసీ ఠాకూర్‌ను బండరాయితో మోది హత్య చేసి పరారైనట్లు తెలిసింది. దీంతో వారి స్వస్థలాలకు వెళ్లి నిందితులను పట్టుకుని పుట్టపర్తికి తీసుకువచ్చారు. కేసును ఛేదించిన  సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్‌ఐ వెంకటేష్‌ నాయక్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement