కమిషనరేట్ను వీడని పలువురు ఏసీపీలు
అధికార పార్టీ నేతల సిఫారసులతో పోస్టింగ్లు
తాజా బదిలీలపై పోలీసు శాఖలో చర్చ
వరంగల్ : మూడు రోజుల క్రితం జరిగిన డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీలపై పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. జనవరి 21న రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది డీఎస్పీల బదిలీలు జరిగాయి. వరంగల్ కమిషరేట్ పరిధిలో నలుగురు డీఎస్పీ(ఏసీపీ)ల పోస్టింగ్లు మారాయి. డీఎస్పీ స్థాయి అధికారులకు సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్లు ఇస్తారు. మన జిల్లాలో కొందరు ఏసీపీలు మాత్రం వరంగల్ కమిషరేట్ పరిధిలోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వం అవసరం కొద్దీ ఇతర జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చినా వీరు మళ్లీ ఇక్కడికే వస్తున్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో ఇదే స్పష్టమైంది. ఇన్నాళ్లు వరంగల్ కమిషరేట్లోనే పనిచేసిన పలువురు మళ్లీ ఇక్కడిక్కడే పోస్టింగ్లు పొందారు. ఇతర జిల్లాలకు బదిలీ చేస్తే... నెలల్లోనే మళ్లీ ఇక్కడికి వచ్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ‘అంగీకారం’తోనే తాజా డీఎస్పీల బదిలీలు జరిగినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలకు, పోలీసు వర్గాలకు మధ్య పలువురు వ్యాపార వర్గాలు అనుసంధానకర్తలుగా వ్యవహరించారనే చర్చ సైతం జరుగుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన పలువురు డీఎస్పీలను ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. ఇలా బదిలీ అయిన వారు తాజాగా మళ్లీ ఇక్కడికే చేరుకున్నారు.
డీఎస్పీల తాజా బదిలీల్లో ఎస్.ఎం.సురేంద్రనాథ్ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పోస్టింగ్ పొందారు. నెల క్రితం వరకు సురేంద్రనాథ్ వరంగల్లోనే పనిచేశారు. సరేంద్రనాథ్ 2014 నవంబరులో వరంగల్ డీఎస్పీ(ఏసీపీ)గా నియమితులయ్యారు. ఆయనను డీజీపీకి అటాచ్ చేస్తూ 2016 నవంబరులో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా మళ్లీ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పోస్టింగ్ పొందారు. సురేంద్రనాథ్ పోస్టింగ్ కోసం మరో డీఎస్పీని మూడు రోజుల్లోనే బదిలీ చేశారు. వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పి.సంజీవరావును నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. సురేంద్రనాథ్ కోసం తాజాగా సంజీవరావును మూడు రోజుల్లోనే స్టేషన్ఘన్పూర్ ఏసీపీగా బదిలీ చేసింది. సంజీవరావు అంతకుముందు వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే పరకాల డీఎస్పీగా ఎక్కువ కాలం పనిచేశారు.
తాజా బదిలీల్లో మామునూరు ఏసీపీగా పోస్టింగ్ పొందిన పి.శోభన్కుమార్ సర్వీసు మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే సాగుతోంది. 2013లో డీఎస్పీగా పదోన్నతి పొంది మహబూబాబాద్ ఎస్డీపీవోగా పోస్టింగ్ పొందారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత హన్మకొండ డీఎస్పీ(ఏసీపీ)గా నియమితులయ్యారు. జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో ప్రభుత్వం శోభన్కుమార్ను కొత్తగూడెం జిల్లా ఓఎస్డీగా నియమించింది. త్వరలో పదోన్నతి పొందనున్న భోభన్కుమార్ను ప్రభుత్వం ముందుగానే అడిషనల్ ఎస్పీ స్థాయి పోస్టింగ్ ఇచ్చింది. మూడున్నర నెలల్లోనే శోభన్కుమార్ మళ్లీ బదిలీపై వరంగల్ కమిషరేట్ పరిధిలోకే వచ్చారు.
వరంగల్ కమిషరేట్లో క్రైం విభాగం డీఎస్పీ(ఏసీపీ)గా పనిచేసే ఈశ్వరరావును ప్రభుత్వం డిసెంబరులో బదిలీ చేసి నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. ఈశ్వరరావు అక్కడ విధుల్లో చేరి సెలవు పెట్టారు. తాజా బదిలీల్లో మళ్లీ వరంగల్ కమిషరేట్ పరిధిలో పోస్టింగ్ పొంది వర్ధన్నపేట ఏసీపీగా నియమితులయ్యారు.
మళ్లీ ఇక్కడికే..!
Published Tue, Jan 24 2017 10:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement