దిగ్విజయ్ తో జగ్గారెడ్డి మంతనాలు | Jaggareddy to join congress soon | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్ తో జగ్గారెడ్డి మంతనాలు

Jul 30 2015 1:43 PM | Updated on Mar 29 2019 9:31 PM

దిగ్విజయ్ తో జగ్గారెడ్డి మంతనాలు - Sakshi

దిగ్విజయ్ తో జగ్గారెడ్డి మంతనాలు

మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తో ఆయన ...

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తో గురువారం భేటీ అయిన ఆయన మంతనాలు జరుపుతున్నారు.  త్వరలో జగ్గారెడ్డి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా గత సాధారణ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు.

తెలంగాణ ముఖ్యమంత్రి మెదక్ లోక్‌సభ సీటుకు రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి.... బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలో ఇమడలేక, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement