ఒప్పంద అధ్యాపకుల వినూత్న నిరసన | Innovative protest of contractual teachers | Sakshi
Sakshi News home page

ఒప్పంద అధ్యాపకుల వినూత్న నిరసన

Dec 24 2016 10:38 PM | Updated on Sep 4 2017 11:31 PM

ఒప్పంద అధ్యాపకుల వినూత్న నిరసన

ఒప్పంద అధ్యాపకుల వినూత్న నిరసన

కొంగ జపం చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట ఒప్పంద అధ్యాపకులు శనివారం వినూత్న నిరసన తెలిపారు.

కర్నూలు(న్యూసిటీ): కొంగ జపం చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట ఒప్పంద అధ్యాపకులు శనివారం వినూత్న నిరసన తెలిపారు. ముందుగా.. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం నుంచి బుధవారపేట మీదుగా కలెక్టరేట్‌ వరకు వీరు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసంఘం జిల్లా అధ్యక్షుడు ఎంఎ నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఒప్పంద అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.   కర్నూలులో 23రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సరైన హామీ ఇవ్వకపోతే అమరణ నిరహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఒప్పంద అధ్యాపకులు చాంద్‌బాషా, మల్లికార్జున స్వామి, రామకృష్ణ, షఫీ, అన్వర్, నజీర్, రాగమంజరి, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement