అంత్య పుష్కర ఘాట్‌లకు ఇన్‌చార్జుల నియామకం | inchrges appointed for godavari pushkara | Sakshi
Sakshi News home page

అంత్య పుష్కర ఘాట్‌లకు ఇన్‌చార్జుల నియామకం

Jul 22 2016 12:08 AM | Updated on Oct 4 2018 5:34 PM

జిల్లాలో ఈనెల 31 నుంచి జరగనున్న గోదావరి అంత్య పుష్కరాలకు 12 మంది డిప్యూటీ కలెక్టర్లను ఘాట్ల ఇన్‌చార్‌్జలుగా నియమిస్తూ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

కాకినాడ సిటీ:  జిల్లాలో ఈనెల 31 నుంచి జరగనున్న గోదావరి అంత్య పుష్కరాలకు 12 మంది డిప్యూటీ కలెక్టర్లను ఘాట్ల ఇన్‌చార్‌్జలుగా నియమిస్తూ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులు రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్, సబ్‌ కలెక్టర్ల సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఎ.శ్రీరామచంద్రమూర్తిని రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్‌కు, పి.శ్రీరామచంద్రమూర్తికి పుష్కర్‌ ఘాట్‌కు, టీవీఎస్‌జీ కుమార్‌ను టీటీడీ ఘాట్‌కు, ఎన్‌.సుగుణ కుమారిని మార్కెండేయస్వామి దేవాలయం ఘాట్‌కు, ఎస్‌.మల్లిబాబును శారదానంద ఘాట్‌కు, ఎస్‌.భీమానంద్‌ను పద్మావతి ఘాట్‌కు ుఇన్‌చార్జులుగా నియమించారు. అలాగే జీవీ సత్యవాణిని సరస్వతి ఘాట్, వీవీఐపీ ఘాట్‌కు, డీఎస్‌ సునితాను గౌతమీ ఘాట్‌కు నియమించారు. ధవళేశ్వరం రామపాదాల రేవుకు హెచ్‌వీ ప్రసాద్‌రావును, కోటిపల్లి పుష్కర్‌ ఘాట్, కోటిపల్లి పుష్కర్‌ «ఘాట్‌–1,2లకు రామచంద్రపురం ఆర్‌డీఓ కె.సుబ్బారావును, దేవీపట్నంలోని పోచమ్మగండి ఘాట్‌కు డీవీఎల్‌ఎం ఎల్లారమ్మను, అంతర్వేది, వాడపల్లి, అప్పనపల్లి ఘాట్‌లకు ఇన్‌చార్జి అధికారిగా అమలాపురం ఆర్‌డీఓ జి.గణేష్‌ కుమార్‌ను నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

అధికారులతో సమీక్ష
గోదావరి అంత్యపుష్కరాల నిర్వహించే ఎనిమిది ప్రధాన గ్రామీణ ఘాట్లలో యాత్రికుల సౌకర్యం, రక్షణ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ కోర్టు హాలులో కలెక్టర్‌ జిల్లా పంచాయతీ అధికారి, అమలాపురం, రామచంద్రపురం ఆర్‌డీఓలు, ఈఓపీఆర్‌డీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే గోదావరి అంత్యపుష్కరాల సందర్భంగా యాత్రికులు ప్రధానంగా సందర్శించే 8 గ్రామీణ ఘాట్‌లలో భద్రత, సదుపాయాలను వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement