విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
రోడ్డు ప్రమాద మృతులను విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేటకు చెందిన రాంబాబు (50), నారాయణరావు (50), మోహన్నాయుడు (8)గా గుర్తించారు. ప్రమాదంలో మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


