లారీ కిందపడి క్లీనర్ మృతి
కోదాడరూరల్
ప్రమాదవశాత్తు లారీ కిందపడి క్లీనర్ మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కూచిపూడిలో బుధవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం బీరోలుకు చెందిన పెరుమళ్ల హరీష్(20) తల్లిదండ్రులు చనిపోయారు. అతను అదే జిల్లా కొనిజెర్ల మండలం తనికెళ్లలో గ్రామంలో తన బాబాయ్ ఇంటి వద్ద ఉంటూ లారీక్లీనర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మేళ్లచెర్వు మండలంలోని సిమెంట్ పరిశ్రమలకు వెళ్తున్నారు. కూచిపూడి వద్దకు రాగానే రోడ్డు మరమ్మతులు చేస్తుండటంతో డ్రైవర్ లారీని ఆపి హరిష్ను టైర్ల సందులో ఇరుక్కున్న రాళ్లను తీయమని చెప్పాడు. దీంతో అతను రాళ్లుతీస్తుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో క్లీనర్ను మరిచిపోయిన డ్రైవర్ లారీని పక్కకు తీస్తుండగా టైర్కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలపారు.