పాలమూరు టు గోవా | goa special train from mahaboobnagar | Sakshi
Sakshi News home page

పాలమూరు టు గోవా

Jan 7 2017 12:05 AM | Updated on Mar 22 2019 2:57 PM

పాలమూరు టు గోవా - Sakshi

పాలమూరు టు గోవా

గోవాకు వీక్లి ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌–వాస్కోడిగామ రైలు లాంఛనంగా ప్రారంభమైంది.

వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం
జిల్లా మీదుగా తరలిన రైలు
సీనియర్‌ సిటిజన్ల స్వాగతం


గోవాకు వీక్లి ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌–వాస్కోడిగామ రైలు నాంపల్లి నుంచి గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రైలు పాలమూరు మీదుగా వెళ్లడంతో ఆ రూట్‌లలో వెళ్లే ప్రయాణికులు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి నుంచి ఉదయం 9:20కి బయలుదేరి మహబూబ్‌నగర్‌ స్టేషన్‌కు 11:57కు చేరుకుంటుంది.

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రైల్వే ప్రయాణికులకు శుభవార్త. గోవా వెళ్లడానికి హైదరాబాద్‌ నుంచే రైలు సౌకర్యం ఉండేది. ప్రయాణికుల సౌకర్యార్థం నాంపల్లి నుంచి గోవాకు దక్షిణమధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసింది. గత నెల 29న ఈ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. గోవాకు వీక్లి ఎక్స్‌ప్రెస్‌ (17021) హైదరాబాద్‌–వాస్కోడిగామ రైలు నాంపల్లి నుంచి గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. నాంపల్లి నుంచి ఉదయం 9:20గంటలకు బయలుదేరిన గోవా రైలు మహబూబ్‌నగర్‌ స్టేషన్‌కు 11:57గంటలకు చేరుకుంటుంది.

రైలుకు సీనియర్‌ సిటిజన్ల స్వాగతం
జిల్లా స్టేషన్‌కు చేరుకున్న గోవా రైలుకు స్థానిక స్టేషన్‌ మేనేజర్‌ పుష్పరాజ్‌తోపాటు సీనియర్‌ సిటిజన్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి పూలు దండవేశారు. అనంతరం ప్రయాణికులకు మిఠాయిలు పంచిపెట్టారు. గోవా రైలును వారంలో రెండుసార్లు తిరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గోవా ఎక్స్‌ప్రెస్‌ రైలు వివరాలు
ఈ గోవా రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్, డోన్, గుంతకల్లు, బళ్లారి, తొరంగల్లు, హోస్పెట్, మునీరాబాద్, కొప్పల్, గద్, అనిగేరి, హుబ్లి, లోండ్‌క్యాస్టిల్‌రాడ్, కుళ్లెం మీదుగా వాస్కోడిగామ(గోవా)కు మరుసటì రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17022) ఉదయం 9గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 7:40 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

ప్రయాణికులకు సౌకర్యం
జిల్లా మీదుగా గోవాకు రైలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. గోవాకు హైదరాబాద్‌ నుంచి వెళ్లేవారు. టికెట్‌ ధరలు కూడా తక్కువగాను ఉన్నాయి. ఈ గోవా రైలు వారంలో రెండుసార్లు తిరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ రైల్వేలైన్‌ను పూర్తి చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళుతుంది.
– మహ్మద్‌ యాకుబ్, రైల్వే ప్రయాణికుడు

సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా మీదుగా గోవా రైలు వెళ్తుంది. ఈ సౌకర్యాన్ని ఇక్కడి ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణమ«ధ్య రైల్వే ఎన్నో వసతులు కల్పిస్తుంది.   – పుష్పరాజ్, స్టేషన్‌ మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement