గోమాత మాల దీక్ష స్వీకరణ | Sakshi
Sakshi News home page

గోమాత మాల దీక్ష స్వీకరణ

Published Fri, Nov 11 2016 11:47 PM

గోమాత మాల దీక్ష స్వీకరణ

కర్నూలు (న్యూసిటీ): జిల్లా గోరక్షణ మహాసంఘం (గోరక్షణ శాల)లో శుక్రవారం తొలిసారిగా 30 మంది గోమాత మాల దీక్షలు స్వీకరించారు. శ్రీకృష్ణ భగవానునికి, గోమాతలకు పూజలు చేసి, గోవుకు పచ్చిగడ్డితో తులాభారం నిర్వహించి దీక్ష చేపట్టారు.  ఈ సందర్భంగా దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యనిర్వణాధికారి కె.కమలాకర్‌ మాట్లాడుతూ.. గోమాత మాల దీక్షలు స్వీకరిస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుందన్నారు. మిడ్తూరు గ్రూపు దేవాలయాల కార్య నిర్వహణాధికారి టి.హనుమంతరావు, మాజీ పాలక మండలి సభ్యులు శ్రీకాంత్‌ నాయుడు, ఎస్‌.సదానందం పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement