మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది
రాయచోటి: వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. పాలెం మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీకి చెందిన చంద్ర కుటుంబంపై టీడీపీకి చెందిన ప్రస్తుత సర్పంచ్ వెంకటాద్రి, ఎంపీటీసీ గంగయ్య, మల్లేష్లు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, చంద్ర స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా అడ్డుకోవడంతో ఈ దాడి జరిగింది.