తూర్పుగోదావరిలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరిలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

Published Fri, Jan 1 2016 7:12 AM

తూర్పుగోదావరిలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం - Sakshi

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా తమ అభిమాన హీరోలకు ఫ్లెక్సీలు కట్టడానికి రెండు మండలాల్లో కొందరు అభిమానులు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురయ్యారు. రెండు మండలాల్లో జరిగిన ఈ సంఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో 7 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది.

వివరాలిలా ఉన్నాయి.. రంగంపేట మండలం వడిశలేరులో ఇద్దరు మృతిచెందారు. మండపేట మండలం మారేడుబాకలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement