సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రస్తు తమున్న అటవీ పర్యావరణ అనుమతుల నిబంధనలను సరళీకృతం చేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్మాధవ్ దవేను కోరారు.
⇒ కేంద్ర మంత్రి అనిల్దవేకు సీఎం కేసీఆర్ లేఖ
⇒ జాప్యంతో సాగునీటి ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని ఆందోళన
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రస్తు తమున్న అటవీ పర్యావరణ అనుమతుల నిబంధనలను సరళీకృతం చేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్మాధవ్ దవేను కోరారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన పర్యా వరణ అనుమతులలో తీవ్ర జాప్యం జరుగు తోందని, దీన్ని నివారించే చర్యలు తీసుకోవా లని కోరారు. ఈ మేరకు మంగళవారం కేసీఆర్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. అనుమతుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నందువల్ల ప్రాజెక్టుల వ్యయ అంచనాలు భారీగా పెరిగి ఖజానాపై భారం పడుతోందన్నారు.
ఆ పరిధి నుంచి తప్పించండి: ఇదే సమయంలో... ‘భారీ ఖర్చుతో చేప డుతున్న సాగునీటి ప్రాజెక్టుల కింద పర్యా వరణ, అటవీ అనుమతుల క్లియరెన్స ప్రక్రియ సుదీ ర్ఘంగా ఉంటోంది. దీంతో ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుతోంది. ఈ దృష్ట్యా, పర్యావ రణ, అటవీ అనుమతితో ముడిపడిన ప్రాజెక్టు లను మిగతా ప్రాజెక్టులతో విడిగా చూడాలి. వీటి కింద నిర్ణీత సమయంలో సత్వర సాగు ఇవ్వాలంటే ప్రత్యేక మెకానిజం ఉండాలి. ఇందుకుగానూ ప్రాజెక్టులను పర్యావరణ, అట వీ అనుమతుల పరిధిలోంచి తప్పించండి. లేదా ఆ అనుమతులు వచ్చేలోపు ప్రాజెక్టుల పనులు జరిగేలా చూడండి’అని సీఎం లేఖలో విన్నవించారు.
కెనాల్, టన్నెల్ తవ్వకాలకు పలు వెసులుబాట్లు ఇచ్చిన మాదిరే పంప్ హౌస్లకు అనుమతుల ప్రక్రియలో సడలింపు లివ్వాలని కోరారు. ప్రాజెక్టుల్లో కోల్పోతున్న అటవీ విస్తీర్ణం మేరకు ప్రత్యామ్నాయంగా సామాజిక వనాల పెంపకాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ క్రమంలో ప్రాజె క్టులకు అటవీ సంరక్షణ చట్టం-1980 చట్టాన్ని సరళీకృతం చేస్తూ అనుమతివ్వాలని లేఖలో కోరారు.