తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో ఆదివారం తెల్లవారుజామున ఓ మృతదేహం వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది.
తిరుమల: తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో ఆదివారం తెల్లవారుజామున ఓ మృతదేహం వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీయించి అశ్వని ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.