అల్లుకున్న నిర్లక్ష్యం | current poles covered by trees | Sakshi
Sakshi News home page

అల్లుకున్న నిర్లక్ష్యం

Sep 20 2016 6:12 PM | Updated on Sep 4 2017 2:16 PM

నర్సాపూర్‌లో పిచ్చిమొక్కలతో నిండి ఉన్న విద్యుత్తు స్తంభం

నర్సాపూర్‌లో పిచ్చిమొక్కలతో నిండి ఉన్న విద్యుత్తు స్తంభం

విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ విద్యుత్తు స్తంభం.

  • విద్యుత్తు అధికారుల తీరుకు సాక్ష్యం.. నిలువెత్తు ఈ స్తంభం
  • నర్సాపూర్‌ రూరల్‌: విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ విద్యుత్తు స్తంభం. నర్సాపూర్‌ పట్టణం నడిబొడ్డున ఉన్న దివంగత మాజీ ఎమ్మెల్యే గుండం వీరయ్య ఇంటి ఎదుట  ఉన్న విద్యుత్తు స్తంభంపై పిచ్చిమొక్కలు ఎగబాకి  ప్రమాదకరంగా మారాయి. పిచ్చిమొక్కలు స్తంభాన్ని అల్లుకోవడంతో అటుగా వెళ్లే చిన్నపిల్లలు, కొత్తగా వచ్చే వ్యక్తులు విద్యుత్తు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ స్తంబానికి వీధిలైట్లతోపాటు పలు ఇండ్లకు విద్యుత్తు సరఫరా చేసే కండక్టర్‌ వైర్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement