పుష్కరాల సందర్భంగా నేరస్థులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించే అవకాశము ఉన్నందున అర్బన్ జిల్లా పోలీసులు ఎస్ఐ వీరేంద్ర ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్ యాప్ ద్వారా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలు పరిశీలిస్తున్నట్లు అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠి త్రిపాఠీ తెలిపారు.
నేరస్తులైతే ఇలా దొరికిపోతారు..!
Aug 19 2016 11:01 PM | Updated on Sep 13 2018 3:15 PM
నగరంపాలెం: పుష్కరాల సందర్భంగా నేరస్థులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించే అవకాశము ఉన్నందున అర్బన్ జిల్లా పోలీసులు ఎస్ఐ వీరేంద్ర ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్ యాప్ ద్వారా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలు పరిశీలిస్తున్నట్లు అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠి త్రిపాఠీ తెలిపారు.
పుష్కరఘాట్ల వద్ద, రైల్వేస్టేషన్, బస్టాండ్, దేవాలయాలు ఇతర ప్రయాణికుల రద్దీ ప్రాంతంలో క్రై మ్ పోలీసులతో పాటు ప్రత్యేక బృందం సభ్యులు ఫింగర్ ప్రింట్ డివైజ్ ద్వారా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఇతర రాష్ట్రాల్లో సైతం నేర చరిత్ర ఉన్నా తెలుసుకునే వీలు కలుగుతుందని తెలిపారు.
Advertisement


