కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య | couple suicide in guntur district | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

Jul 21 2016 9:57 AM | Updated on Jul 10 2019 8:00 PM

గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలో కుటుంబ కలహాలతో దంపతులు గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

గుంటూరు : గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలో కుటుంబ కలహాలతో దంపతులు గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఫైనాన్స్ వ్యాపారంతో పాటు బియ్యం వ్యాపారం చేసే గుండా ప్రసన్నాంజనేయులు (44), స్రవంతి దంపతులకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబకలహాల కారణంగా ఇద్దరూ గురువారం వేకువజామున ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

చిన్నారుల ఏడుపులు విని ఇరుగు పొరుగువారు వెళ్లి చూడగా దంపతులు ఇద్దరూ ఫ్యానుకు వేలాడుతున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement