కుటుంబ వివాదంలో తన కుమారుడికి అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారంటూ అనంతపురం త్రీటౌన్ పోలీసులపై గుత్తికి చెందిన మాజీ సైనికుడు మస్తాన్వలి బుధవారం ఎస్పీ ఎస్.వి.రాజÔó ఖరబాబుకు ఫిర్యాదు చేశారు.
అనంతపురం సెంట్రల్ : కుటుంబ వివాదంలో తన కుమారుడికి అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారంటూ అనంతపురం త్రీటౌన్ పోలీసులపై గుత్తికి చెందిన మాజీ సైనికుడు మస్తాన్వలి బుధవారం ఎస్పీ ఎస్.వి.రాజÔó ఖరబాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. తన కుమారుడు రహీమ్కు అనంతపురంలోని బళ్లారి బైపాస్వద్ద నివాసముంటున్న అహ్మదుల్లా కుమార్తెతో 2013లో వివాహమైందని తెలిపారు. తాము ఎటువంటి కట్నకానుకలూ స్వీకరించలేదని పేర్కొన్నారు. మనస్పర్థలతో కోడలు మూడు నెలలకే పుట్టింటికి వెళ్లిపోయిందని, ఇప్పుడు విడాకుల కోసం తన కుమారుడిపై ఒత్తిడి తెస్తున్నారని, రూ.25లక్షలు అడుగుతున్నారని వివరించారు.
ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోందని, కోర్టు సూచనల మేరకు గతేడాది జూన్ నుంచి నెలకు రూ. 5వేలు చొప్పున కోడలికి చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టులో వ్యవహారం నడుస్తున్నా త్రీటౌన్ పోలీసులు తన కుమారుడికి అన్యాయం జరిగేలా పంచాయితీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై త్రీటౌన్ సీఐ గోరంట్ల మాధవ్ను వివరణ కోరగా.. తనను భర్త వేధిస్తున్నాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేసి.. రిమాండ్కు పంపుతున్నామన్నారు. ఇందులో ఎటువంటి వేధింపులూ లేవని స్పష్టం చేశారు.