వైఎస్‌ఆర్‌ జిల్లాలో చిరుత సంచారం కలకలం | Cheetah Wandering In ysr district | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ జిల్లాలో చిరుత సంచారం కలకలం

Feb 14 2017 9:46 AM | Updated on Sep 5 2017 3:43 AM

వైఎస్సార్‌ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది

గాలివీడు(వైఎస్సార్‌ జిల్లా): వైఎస్సార్‌ జిల్లా గాలివీడు మండలం పూలకుంట గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. మంగళవారం వేకువజామున గ్రామ సమీపంలో ఉన‍్న గొర్రెల మందపై చిరుత దాడిచేసింది. ఈ సంఘటనలో ఆరు గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల మంద వద‍్ద కాపలా ఉన‍్న గొర్రెల కాపరులు చిరుతను చూసి భయాందోళనకు గురై పరుగుతీశారు. చిరుత ఆరు గొర్రెలను హతమార్చి సమీపంలోని అడవిలోకి వెళ్ళిపోయింది. అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement