సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తన తండ్రి మహానేత డాక్టర్ వైఎస్సార్కు నివాళులు అర్పించారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.



