పులివెందులలో వైఎస్‌ జగన్‌ | Ys Jagan Pulivendula Tour July 7th Day 1 Updates | Sakshi
Sakshi News home page

పులివెందులలో వైఎస్‌ జగన్‌

Jul 7 2026 12:03 PM | Updated on Jul 7 2026 12:15 PM

Ys Jagan Pulivendula Tour July 7th Day 1 Updates

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు. ఇవాళ, రేపు ఆయన వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ (మంగళవారం) భాకరాపురం క్యాంప్‌ కా­ర్యా­లయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

రేపు(జులై 8, బుధవారం) ఉద­యం పులివెందుల నుంచి బయ­లు­దేరి ఉద­యం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement