ట్రైల్ రన్ వేస్తానని కారుతో పరారీ అయిన సంఘటన ఆటోనగర్లో చోటు చేసుకుంది.
బస్టాండ్లో బాడిగకు అంబాషిడర్ కారును మాట్లాడుకుని అమరావతి రోడ్డులో ఉంటున్న విష్ణువర్ధన్ను కలిశారు. మెకానిక్కు చూపించాలని అందరూ కలసి ఆటోనగర్ హ్యుండయ్ షోరూం వద్దకు వచ్చారు. టెక్నీషియన్తో కారు తోలించి ట్రైల్ రన్ వేస్తానని మేం ఇద్దరమే ట్రైల్కు వెళ్ళి వస్తామని చెప్పి షోరూం టెక్నీషియన్తో పెదకాకాని వైపు వెళ్ళాడు. టెక్నీషియన్ను మార్గమద్యంలో దింపి ఇక్కడే ఉండమని చెప్పి ఆ వ్యక్తి కారుతో ఉడాయించాడు. కొంత సేపు చూసిన తరువాత కూడా రాకపోవడం, టెక్నీషియన్ షోరూంకు చేరుకోవడంతో తాము మోసపోయామని భావించిన విష్ణువర్ధన్ పెదకాకాని పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.