మైదుకూరు టౌన్: మైదుకూరు సమీపంలోని జాతీయ రహదారిలో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు– కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న నాన్స్టాప్ ఆర్టీసీ బస్సు మైదుకూరు శివారులోని జాతీయ రహదారిలోకి వెళ్తుండగా.. అదే సమయంలో చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ కంటైనర్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రమీల, రాధమ్మ, జాని, రాఘవేంద్ర, రమాదేవి, లక్ష్మీదేవిలకు తీవ్ర గాయాలు కాగా ఎన్.ఓబులేసు, టి.ఓబులేసు, హరిప్రసాద్, రవి, రెడ్డయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా కడప, రాజంపేట ప్రాంతాలకు చెందిన వారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
బస్సు, లారీ ఢీ.. 12 మందికి గాయాలు
Published Sat, Oct 15 2016 1:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గడ్డివాము దగ్ధం
ఐడియా అదిరింది..!
ఇక్కడ చెల్లనిది అక్కడ చెల్లుతోంది
‘ప్రేరణ’కు జ్యోతీబా పూలే విద్యార్థిని భవిజ్ఞ
వెలవెలబోతున్న ‘వరప్రదాయిని’
ప్రభుత్వాధీనంలోనే షుగర్ ఫ్యాక్టరీలను నడిపిస్తాం
శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అనారోగ్యంతో తల్లి.. బెంగతో కూతురు మృతి
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
అదనపు ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement