చింతపల్లి మండలం దేవులాతండా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
చింతపల్లి మండలం దేవులాతండా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా దర్శి మండలకేంద్రానికి చెందిన మనోజ్(3) అనే బాలుడు మృతిచెందగా..బాలుడి తల్లి సరస్వతి, తండ్రి రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదసమయంలో కారు మల్లేపల్లి నుంచి హైదరాబాద్కు వస్తుండగా..బైక్ హైదరాబాద్ నుంచి దర్శి వెళ్తోంది. బైక్పై ప్రయాణిస్తోన్న వారు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.