బళ్లారి జిల్లా వాసి ఆత్మహత్య | bellary district citizen suicide | Sakshi
Sakshi News home page

బళ్లారి జిల్లా వాసి ఆత్మహత్య

Feb 11 2017 11:30 PM | Updated on Nov 6 2018 7:53 PM

బళ్లారి జిల్లా కుడితిని గ్రామానికి చెందిన కమ్మరి గోవిందప్ప కుమారుడు కమ్మరి సురేష్‌ మారుతీ లాడ్జ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

మంత్రాలయం రూరల్‌:  బళ్లారి జిల్లా కుడితిని గ్రామానికి చెందిన కమ్మరి గోవిందప్ప కుమారుడు కమ్మరి సురేష్‌ మారుతీ లాడ్జ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాల మేరకు..సురేష్‌ రెండ్రోజులు క్రితం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చాడు. మారుతి లాడ్జ్‌లో దిగి రూం నెంబరు 15లో బస చేశాడు. శనివారం ఉదయం అద్దె డబ్బుల కోసం వెళ్లిన రూంబాయ్‌ గదిలోనుంచి దుర్వాసన వస్తుండడంతో  తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే కమ్మరి సురేష్‌(27) మరణించి ఉన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement