సాక్షి, కర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై పచ్చ మూకలు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వాహనాలకు పచ్చమూక నిప్పుపెట్టారు. టీడీపీ గూండాల దాడిలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు.
దారి కాసి మరి వాహనాలను అడ్డుకున్న టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. సమాచారం తెలుసుకొని మాధవరం బయల్దేరిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.


