ముగిసిన అథ్లెటిక్స్‌ పోటీలు | Athletics competitions end | Sakshi
Sakshi News home page

ముగిసిన అథ్లెటిక్స్‌ పోటీలు

Dec 11 2016 10:47 PM | Updated on Sep 4 2017 10:28 PM

ముగిసిన అథ్లెటిక్స్‌ పోటీలు

ముగిసిన అథ్లెటిక్స్‌ పోటీలు

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ కళాశాలల విద్యార్థులకు బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్న అంతర్‌ కళాశాలల పోటీలు శనివారం ఉత్కంఠ భరితంగా సాగాయి.

* హోరాహోరీగా అంతర్‌ కళాశాలల పోటీలు
 
బాపట్ల టౌన్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ కళాశాలల విద్యార్థులకు బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్న అంతర్‌ కళాశాలల పోటీలు శనివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. రాష్ట్రంలోని 9 కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. పుట్‌బాల్‌లో విన్నర్స్‌గా బాపట్ల వ్యవసాయ కళాశాల, రన్నర్స్‌గా బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాలలు నిలిచాయి. క్రికెట్‌లో సెమిఫైనల్స్‌కు బాపట్ల వ్యవసాయ కళాశాల, నైరా వ్యవసాయ కళాశాలలు చేరుకున్నాయని వ్యవసాయ కళాశాల స్టూడెంట్స్‌ ఎఫైర్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి. అనిల్‌కుమార్‌ తెలిపారు. 
 
అథ్లెటిక్స్‌లో విజేతలు వీరే...
  • 1000 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా  ఎన్‌. హరికృష్ణ (వ్యవసాయ కళాశాల, నైరా), ఎం.కె. శ్రీకాంత్‌ (వ్యవసాయ కళాశాల, తిరుపతి), ఐ. బాలమణికంఠ (వ్యవసాయ కళాశాల, బాపట్ల) నిలిచారు. 
  • 200 మీ పరుగుపందెంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా  కె. రామ్‌నాయుడు (వ్యవసాయ కళాశాల, నైరా),వై. రాజేష్, టి. గణేష్‌ వర్మ (వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల, మడకశిర), ఉన్నారు.
  • షార్ట్‌పుట్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా జి. అదిత్య (వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాల, బాపట్ల), జె. మధు (వ్యవసాయ కళాశాల, నైరా), ఎ.జి.హెచ్‌ ప్రసాద్‌ (వ్యవసాయ కళాశాల, రాజమండ్రి) గెలుపొందారు.
  • లాంగ్‌ జంప్‌లో వై. రాజేష్‌ (వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాల, మడకశిర),  సిహెచ్‌. సతీష్‌కుమార్‌ (వ్యవసాయ కళాశాల, బాపట్ల), రిబిన్‌ బాబు (వ్యవసాయ కళాశాల, తిరుపతి) ఉన్నారు.
  • ట్రిపుల్‌ జంప్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు మహీంద్రబాబు (వ్యవసాయ కళాశాల, బాపట్ల), రామ్‌నాయుడు (వ్యవసాయ కళాశాల, నైరా), రిబిన్‌బాబుబేబి (వ్యవసాయ కళాశాల తిరుపతి) గెలిచారు.
  • హైజంప్‌లో ప్రథమ, ద్వితీయ తృతీయ స్థానాలు అహ్మద్‌ హుస్సేన్‌ (వ్యవసాయ కళాశాల, తిరుపతి), మహీంద్రబాబు (వ్యవసాయ కళాశాల, బాపట్ల), రిబిన్‌బేబి (వ్యవసాయ కళాశాల, తిరుపతి) నిలిచారు.
  • డిస్కస్‌త్రోలో సాయికుమార్‌ (వ్యవసాయ కళాశాల, నైరా), తిలక్‌ (వ్యవసాయ కళాశాల, నైరా), సతీష్‌ ( వ్యవసాయ కళాశాల, బాపట్ల) విద్యార్థులు గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement