సాయం కోసం కేంద్రానికి చంద్రబాబు లేఖ | ap cm chandra babu letter to central government over floods | Sakshi
Sakshi News home page

సాయం కోసం కేంద్రానికి చంద్రబాబు లేఖ

Nov 19 2015 6:25 PM | Updated on Aug 20 2018 9:16 PM

తుపాను, వరదలతో తీవ్రంగా నష్టపోయామని కేంద్రం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు.

విజయవాడ: తుపాను, వరదలతో తీవ్రంగా నష్టపోయామని ... ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కేంద్ర ప్రభుత్వానికి  లేఖ రాశారు. ఏపీలో వరదల కారణంగా ప్రాథమికంగా 3 వేల కోట్ల మేర నష్టం జరిగిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా తన లేఖలో విజ్ఞప్తి చేశారు. త్వరలోనే జరిగిన మొత్తం నష్టాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తానని పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement