'అండమాన్'ని నిలిపివేసిన అధికారులు | Andaman express stranded in doravari satram railway station | Sakshi
Sakshi News home page

'అండమాన్'ని నిలిపివేసిన అధికారులు

Nov 13 2015 10:46 AM | Updated on Sep 3 2017 12:26 PM

జమ్మూ నుంచి చెన్నై వెళ్తున్న అండమాన్ ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం నెల్లూరు జిల్లా దొరవారిసత్రం రైల్వే స్టేష్టన్‌లో అధికారులు నిలిపివేశారు.

నెల్లూరు : జమ్మూ నుంచి చెన్నై వెళ్తున్న అండమాన్ ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం నెల్లూరు జిల్లా దొరవారిసత్రం రైల్వే స్టేష్టన్‌లో అధికారులు నిలిపివేశారు. తమిళనాడులోని కొరుగుపేట - తొండయార్‌పేట మధ్య రైల్వే ట్రాక్‌పైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో అండమాన్ ఎక్స్ప్రెస్ రైలును అధికారులు నిలిపేశారు. అలాగే చెన్నై నుంచి నెల్లూరు వచ్చే రైలును కూడా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రైళ్లు ఎక్కడికక్కడ నిలచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement