మాన్వాడ వెళ్లడానికి ఆధార్‌కార్డు | aadhar to going manvaada | Sakshi
Sakshi News home page

మాన్వాడ వెళ్లడానికి ఆధార్‌కార్డు

Sep 26 2016 11:40 PM | Updated on May 25 2018 6:20 PM

కొత్తపేట వద్ద వ్యాను ఎక్కిస్తున్న పోలీసులు - Sakshi

కొత్తపేట వద్ద వ్యాను ఎక్కిస్తున్న పోలీసులు

బోయినపల్లి: మధ్యమానేరు జలాశయం గండిపడడంతో ముందు జాగ్రత్తగా ఆదివారం మండలంలోని మాన్వాడవాసులను అధికారులు ఇళ్లు ఖాళీచేయించారు. సోమవారం నిర్వాసితులు తమ స్వగ్రామం వెళ్లడానికి చాలా తంటాలు పడాల్సివచ్చింది. సీఎం కేసీఆర్‌ వస్తున్నారనే నెపంతో పోలీసులు కొత్తపేటలో చెక్‌పోస్ట్‌ ఏర్పాటుచేశారు.

  • స్వగ్రామం వెళ్లడానికి పోలీసుల ఆంక్షలు
  • బోయినపల్లి: మధ్యమానేరు జలాశయం గండిపడడంతో ముందు జాగ్రత్తగా ఆదివారం మండలంలోని మాన్వాడవాసులను అధికారులు ఇళ్లు ఖాళీచేయించారు. సోమవారం నిర్వాసితులు తమ స్వగ్రామం వెళ్లడానికి చాలా తంటాలు పడాల్సివచ్చింది. సీఎం కేసీఆర్‌ వస్తున్నారనే నెపంతో పోలీసులు కొత్తపేటలో చెక్‌పోస్ట్‌ ఏర్పాటుచేశారు. అడుగడుగునా పహారా ఉంచారు. కొత్తపేట నుంచి మాన్వాడకు ఎవరినీ అనుమతించలేదు. చివరకు ఆధార్‌కార్డు చూపిన వారిని పోలీసులు తమ వాహనంలోనే గ్రామంలోకి తీసుకెళ్లారు. సొంత వాహనాలపై వెళ్లనీయలేదు. భద్రత పేరిట తమ స్వగ్రామం వెళ్లడానికి ఆధార్‌ కార్డు చూపాలనడం.. గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై మాన్వాడవాసులు అభ్యంతరం తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement