
భారీగా ఎర్రచందనం పట్టివేత
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 14 మంది ఎర్ర కూలీలు, స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.
నెల్లూరు (వెలుగోడు) : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 14 మంది ఎర్ర కూలీలు, స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్న భారీ విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. తాము స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు 1.40 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసినట్లు పోలీసులు తెలిపారు.