ఖమ్మం: కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఎన్కూరులో గురువారం వెలుగుచూసింది. స్థానిక కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు రాత్రి భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొత్త బియ్యంతో వంట చేయడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు అంటున్నారు.
Related news
-
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. -
Israel-Hamas war: పాలస్తీనియన్లకు అమెరికా విద్యార్థుల సంఘీభావం
వాషింగ్టన్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గాజాలో మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వందలాది మంది ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ముందస్తుగా అనుమతి లేకుండా వర్సిటీ ప్రాంగణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఒక్కరోజే 100 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో గతవారం విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది. క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలకు వ్యాపించింది. -
NASA భారత విద్యార్థులకు నాసా అవార్డులు
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్లో మన విద్యార్థులు సత్తా చాటారు.న్యూఢిల్లీ ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల బృందాలు నాసా అవార్డులను గెలుచుకున్నాయి.అలబామా రాష్ర్టంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డును గెలుచుకున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సోమవారం ప్రకటించింది. అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈ పోటీలో అమెరికాలోని డాలస్కు చెందిన పారిష్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హంట్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రథమ బహుమతిని గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీలో పాల్గొన్నాయి. అమెరికాలోని 24 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హైస్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో తన ప్రతిభను చాటారు. -
బాసర ఐఐఐటీలో కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య
బాసర ఐఐఐటీలో కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య -
జాతీయ స్థాయి ఇంగ్లిష్ పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ
సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ వర్డ్ పవర్ చాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడంలో భాగంగా విభా, లీప్ ఫార్వార్డ్ సంస్థల ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ వర్డ్ పవర్ చాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్రానికి రెండు బహుమతులు సాధించారు. గత నెల 14వ తేదీన విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులు ఈ నెల 12న ముంబైలో జరిగిన గ్రాండ్ ఫినాలే పోటీల్లో పాల్గొన్నారు. ఫైనల్స్లో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి బి.రేవంత్కుమార్ రెండో స్థానం, ఐదో తరగతి విద్యార్థి అనిల్కుమార్ బాణావత్ మూడో స్థానంలో నిలిచారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను అంచనా వేసేందుకు జాతీయ వర్డ్ పవర్ చాంపియన్షిప్ దేశంలోనే అతిపెద్ద పోటీ కార్యక్రమం. ఈ పోటీలో ఏపీ నుంచి ఐదుగురు విద్యార్థులు పాల్గొనగా, ఇద్దరు విద్యార్థులు రెండు, మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి అభినందించారు. ఈఎల్పీ ద్వారా శిక్షణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు 2021లో ప్రభుత్వం ఇంగ్లిష్ లిటరసీ ప్రోగ్రామ్(ఈఎల్పి)ను ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆరీ్టతో విభా, లీప్ ఫార్వర్డ్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రొగ్రామ్ ద్వారా 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలను సులభంగా పలకడం, చదవడం నేర్పిస్తున్నారు. కనిమెర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించడంతో ప్రభుత్వం చేపట్టిన ఈఎల్పీ సత్ఫలితాలు ఇస్తోందని స్పష్టమవుతోంది.
Related News by category
-
అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలి
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన జీపీల ప్రత్యేక అధికారులతో సమావేశమై పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీఓఇంచచారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షిస్తుండడంతో పాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మిషన్ భగీరథ సరఫరా లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ప్రైవేట్ వనరులను లీజ్కు తీసుకోవాలన్నారు. అలాగే, నర్సరీలు, విద్యుద్దీపాలు, అంతర్గత రహదారుల నిర్వహణపై దృష్టి సారించాలని, సకాలంలో పన్నులు వసూలు చేయడమే కాక ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఈసమీక్షలో జెడ్పీ సీఈఓ వినోద్, డీఆర్డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు. ఏకలవ్య మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి పరీక్ష భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ ప్రభుత్వ ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలుకల్పించేందుకు ఈనెల 28న పరీక్ష నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ తెలిపారు. ఈనెల 28న ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు పరీక్ష ఉంటుందని పేర్నొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https:// tsemrs. telangana. gov. in వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు భద్రాద్రి జిల్లాలో మూడు, ఖమ్మం జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసినట్లు పీఓ తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందించాలి వైరా: వైరా రిజర్వాయర్ వద్ద సక్రమంగా క్లోరినేషన్ చేయడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి ఆదేశించారు. వైరా రిజర్వాయర్ గుట్టపై బోడేపూడి సుజల స్రవంతి పథకం, మిషన్ భగీరథ ఇన్ టేక్వెల్ ప్రాంతాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఇటీవల రిజర్వాయర్ నుంచి రంగు మారిన నీరు సరఫరా అవుతుందనే ప్రచారంతో పరిశీలించిన ఆయన వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి నిల్వలు, క్లోరినేషన్ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కు చేరుతున్న నేపథ్యాన నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఈ కె.శ్రీనివాస్, ఎస్ఈ సదాశివకుమార్, ఈఈలు వాణిశ్రీ, పుష్పలత, డీఈ నర్సింహమూర్తి, ఏఈ మణిశంకర్ పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు తల్లాడ ప్రమాదంపై ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆగ్రహం ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని తల్లాడ సబ్స్టేషన్లో ఆదివారం ట్రాన్స్ఫార్మర్ పేలగా లైన్మెన్గా గాయాలయ్యాయి. ఈ నేపథ్యాన సీఎండీ సోమవారం ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. ఉద్యోగులు, సిబ్బంది విధినిర్వహణలో నిబంధనలు పాటించాలని, పనిప్రాంతంలో గ్లౌజ్లు, హెల్మెట్ విధిగా ధరించాలని సూచించారు. తల్లాడ సబ్స్టేషన్లో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న సీఎండీ.. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూనే విధిగా భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. -
కలెక్టర్ను కలిసిన సివిల్స్ ర్యాంకర్
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం క్రైం/ఖమ్మం మయూరిసెంటర్: ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 938వ ర్యాంక్ సాధించిన బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)కు చెందిన సాయి అలేఖ్య సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వీ.పీ.గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ సత్కరించారు. ఆతర్వాత సీపీ సునీల్దత్ను కూడా కలవగా ఆయన సాయిఅలేఖ్యతో పాటు ఆమె తండ్రి మధిర టౌన్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాశ్రావు – పద్మశ్రీ దంపతులను సన్మానించారు. అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక సాయి అలేఖ్యను ఖమ్మంలోని బీసీ స్టడీసర్కిల్లో సత్కరించారు. స్టడీసర్కిల్లో గ్రూప్స్, డీఎస్సీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి ఏర్పాటుచేయగా.. ఆమె పాల్గొని ఉద్యోగాలకు సన్నద్ధతపై సూచనలు చేశారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, సాయిఅలేఖ్య చదువుకున్న త్రివేణి పాఠశాల, సెంచరీ స్కూల్లో కూడా ఆమెను సన్మానించారు. త్రివేణి డైరెక్టర్లు గొల్లపుడి వీరేంద్రచౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్తో పాటు సీహెచ్.అప్పారావు, స్వప్న, ముస్తఫా, అశోక్, చార్లెస్, సందీప్, సెంచరీ స్కూల్లో కరస్పాండెంట్ డీవీఎస్.ప్రభాకర్రావు, డైరెక్టర్ మాధవీలతతో పాటు స్వరూప, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాయిఅలేఖ్యను సన్మానించిన కలెక్టర్, సీపీ -
గులాబీకి సవాల్..
ఖమ్మం లోక్సభ ఎన్నిక బీఆర్ఎస్కు సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించడం ఎదురీతకు కారణమవుతోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో నెలకొంది. ఇక్కడ విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సర్వశక్తులొడ్డుతున్నా ఫలితం ఎలా ఉండబోతోందన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంనాడు అధికారంలో.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. దీంతో 1,68,065 ఓట్ల మెజార్టీతో నామ విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నాడు 14.74 శాతం ఓట్ల వ్యత్యాసం వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ పరిధి ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు 5,18,194 ఓట్లు వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో నామాకు 49,265 ఓట్లు మాత్రమే అదనంగా నమోదయ్యాయి. ఇప్పుడు భారీ వ్యత్యాసం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. ఖమ్మం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్తో పాటు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థులకు 7,33,293 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు 4,67,639 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తద్వారా కాంగ్రెస్ కూటమి 2,65,654 ఓట్ల మెజార్టీని సాధించినట్లయింది. ఈ గణాంకాలను పరిశీలిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో కూడా లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది. ఖమ్మం లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ ఎదురీత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మెజార్టీ ఓట్లు ఆ పార్టీతో పోలిస్తే ‘కారు’కు 2.65 లక్షల ఓట్ల వ్యత్యాసం ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎటువైపోనని ఉత్కంఠపట్టు దొరికేది ఎక్కడ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖమ్మం నియోజకవర్గంలో 49,381 ఓట్ల మెజార్టీ, పాలేరులో 56,650 మెజార్టీ, సత్తుపల్లిలో 19,440 ఓట్లు, మధిరలో 35,452 ఓట్ల మెజార్టీ, వైరాలో 33,045 ఓట్లు, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి 42,781 ఓట్ల మెజార్టీ, అశ్వారావుపేటలో 28,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడా కూడా బీఆర్ఎస్ అభ్య ర్థులు కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేక పోయారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీ రావడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ పరిధిలో ఎలా ఓట్లు దక్కించుకోవాలి, ఎక్కడ పట్టు దొరుకుతుందనే లెక్కల్లో బీఆర్ఎస్ నేతలు మునిగితేలుతున్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు.. నియోజకవర్గం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖమ్మం 1,36,016 86,635 పాలేరు 1,27,820 71,170 సత్తుపల్లి 1,11,245 91,805 మధిర 1,08,970 73,518 వైరా 93,913 60,868 కొత్తగూడెం (సీపీఐ) 80,336 37,555 అశ్వారావుపేట 74,993 46,088 మొత్తం 7,33,293 4,67,639 -
ఉక్కపోతతో బాలింతలు, చిన్నారుల అవస్థ
ఎంసీహెచ్లో మొరాయిస్తున్న ఏసీలుఖమ్మంవైద్యవిభాగం: ప్రచండ భానుడి ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో చికిత్స పొందుతున్న బాలింతలు వేడి తట్టుకోలేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలు వార్డుల్లో ఏసీలు సరిగ్గా పనిచేయకపోవడంతో అధికారులు కొన్నిచోట్ల కూలర్లు బిగించారు. అయినా గాలి సరిపోక పలువురు ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుని వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. -
‘మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం’
● ఎంపీగా నామను గెలిపిస్తేనే అది సాధ్యం ● ప్రచార సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలిపించాలని పలువురు పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో జరిగిన ప్రచార సమావేశాల్లో అభ్యర్థి నామతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, సామాన్య ప్రజల కష్టాలు కళ్లెదుటే కనబడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా నామ గెలుపు తప్పనిసరని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించినందుకు తప్పు చేశామని భావిస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరిస్తూ నామ గెలుపునకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలను తొలగించడమే కాక హామీలను నెరవేర్చడం లేదంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా పాట రూపంలో వివరించారు. అలాగే, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ బి.ఉమ, నాయకులు తాళ్లూరి జీవన్కుమార్, బెల్లం వేణు, బాషబోయిన వీరన్న, గుడిబోయిన దర్గయ్య, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, ఏ.వరప్రసాద్, దేవరం దేవేందర్రెడ్డి, మాలతి, చావా వేణు, ఆలస్యం నాగేశ్వరరావు, రవి, చామకూరి రాజు తదితరులు పాల్గొన్నారు. ● ఖమ్మం లీగల్: బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులను కలిసి తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు బిచ్చాల తిరుమలరావు, కొత్తా వెంకటేశ్వరరావు, మేకల సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement