
వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లి పోలీస్స్టేషన్ సమీపంలో మంగళవారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఒక యువతి పోలీసు స్టేషన్ సమీపంలోనే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలార్పారు. తీవ్రగాయాలపాలైన ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని సబితగా గుర్తించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది.