ఆరణిలో యువతి ఆత్మహత్య

Young Woman Commits Suicide In Tamil Nadu - Sakshi

విషయం తెలుసుకుని ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం

పోలీస్‌స్టేషన్‌ ఎదుట యువతి బంధువుల ఆందోళన

తిరువణ్ణామలై: ఆరణిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా ఈబీనగర్‌కు చెందిన వేలు, రేణుకల కుమార్తె సౌమ్య(17). వేలు అనారోగ్యంతో మృతి చెందాడు. సౌమ్య పదో తరగతి పూర్తి చేసింది. మూడు సంవత్సరాలుగా ఇంట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో సౌమ్య శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లి రేణుక, బంధువులు కలిసి సౌమ్య మృతి విషయాన్ని పోలీసులకు తెలపలేదు.

ఇదిలా ఉండగా ఆరణిలో ఉన్న సౌమ్య పెద్దమ్మ గౌరీకి రాత్రి 8 గంటలకు ఈ విషయం తెలిసింది. ఆమో వెంటనే అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరైంది. అప్పుడు సౌమ్య మృతిలో అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదును తీసుకోలేదని తెలిసింది. దీంతో ఆగ్రహించిన సౌమ్య బంధువులు ఆదివారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. సౌమ్య మృతిలో అనుమానం ఉందని వీటిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు చేసేది లేక విచారణ చేపట్టారు.

ప్రియుడు ఆత్మహత్యాయత్నం..
సౌమ్య మేనమామ, ప్రియుడుడైన నెసొలి గ్రామానికి చెందిన రగురామన్‌ సౌమ్య ఆత్మహత్య విషయం తెలిసింది. దీంతో అతను ఇంట్లోనే ఉరేసుకోవడానికి యత్నించాడు. ఇది గమనించిన అతని బంధువులు, కుటుంబీకులు రగురామన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top