విరిగి రోడ్డుపై పడిన మహిళ చెయ్యి | Woman Hand Cut Off In Road Accident | Sakshi
Sakshi News home page

విరిగి రోడ్డుపై పడిన మహిళ చెయ్యి

Apr 24 2018 2:27 PM | Updated on Sep 28 2018 3:39 PM

Woman Hand Cut Off In Road Accident - Sakshi

ఫరీనా బేగం మృతదేహం

మొయినాబాద్‌(చేవెళ్ల) : అతివేగం ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. డీసీఎంను నిర్లక్ష్యంతో నడిపి ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టడంతో మహిళ చెయ్యి విరిగి రోడ్డుపై పడింది. మండలంలో తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారిపై చేవెళ్ల మండలం కందవాడ గేటు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.

పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఉప్పర్‌పల్లికి చెందిన హైమద్‌ తన భార్య ఫరీనాబేగం(26), తల్లి సయ్యద్‌బేగం, కూతుళ్లు మైయాక్, హర్ష, రిమ్షా, మోహిన్‌లతో కలిసి సోమవారం ఉదయం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని దర్గాకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు.

చేవెళ్ల మండలం కందవాడ గేటు సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని డీసీఎం వాహనం ఆటోను కొనభాగంలో బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో కుడివైపు కూర్చున్న ఫరీనాబేగం చెయ్యి విరిగి రోడ్డుపై పడిపోయింది.

ఆటోలు ఉన్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. చెయ్యి విరిగిన ఫరీనాబేగంను అదే ఆటోలో వెంటనే కాళీమందిర్‌ సమీపంలో ఉన్న షాదన్‌ ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు. మార్గ మధ్యలో ఆమె మృతి చెందింది.  

కలకలం రేపిన చెయ్యి... 

రోడ్డుపై తెగిపడిన చెయ్యి చేవెళ్ల ప్రాంతంలో కలకలం రేపింది. రోడ్డుపై పడి ఉన్న చెయ్యిని స్థానికులు చూసి సెల్‌ఫోన్‌లలో ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. పోలీసులు సైతం ప్రమాదం జరిగిన స్థలానికి చేరకుని గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించారని తెలుసుకుని అక్కడికి వెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement