రెండు స్కూల్ బస్సులు సీజ్
వెల్గటూరు(ధర్మపురి) కరీంనగర్ : పాఠశాలల ప్రారంభంలోనే రవాణా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో పాఠశాల బస్సులను రవాణాశాఖాధికారి కిషన్రావు తనిఖీ చేశారు. వెల్గటూరు బ్రిలియంట్ మోడల్ స్కూల్, రాజారాంపల్లి అక్షర హైస్కూల్ బస్సులను సీజ్ చేశారు. బస్సులకు సంబంధించి ధ్రుపత్రాలు సరిగా లేనందును సీజ్ చేసినట్లు తెలిపారు.