తెలంగాణలో ఈడీ అధికారుల దాడులు.. ఏకకాలంలో 8 చోట్ల.. | WD Raids in Telangana Again | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఈడీ అధికారుల దాడులు.. ఏకకాలంలో 8 చోట్ల..

May 27 2026 3:39 PM | Updated on May 27 2026 3:45 PM

WD Raids in Telangana Again

హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇసుక, గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. జీఎస్టీ ఎగ్గొట్టి రూ.కోట్లు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీ, ఏజెన్సీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నకిలీ ఇన్ వాయిస్‌లతో గ్రానైట్ తరలించిన కేసులో తనఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ గ్రానైట్ వ్యాపారిని జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు నకిలీ బిల్లులతో వంద కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మరింత దుమారం రేగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement